CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన🌾🌱🌳🌾🌱🌳🌾

Share it:

 


[ఐటిసి మిషన్ సునేహ్రకల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు భవిష్యత్తు కార్యక్రమం]

మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి (సెప్టెంబర్-16)::అన్నపురెడ్డిపల్లి మండలం,తొట్టిపంపు గ్రామంలో ఐటిసి మిషన్ సునేహ్రకల్ వారి యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో) ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కల్పించేందుకు బంగారు భవిష్యత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో యూత్ డెవలప్మెంట్ (వైడిఓ) ఆర్గనైజేషన్ డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ, రైతులు వ్యవసాయంలో పురుగు మందులు వినియోగించడం వలన అనారోగ్య సమస్యలతో బాధపడటమే కాకుండా రైతులు కూడా చాలా నష్టపోతున్నారని,వాతావరణం దెబ్బతింటుందని, రైతులందరూ సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రకృతి సిద్ధమైన పశువుల ఎరువు,వేప పిండి, జీవమృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నీస్త్రం వంటి సహజ కషాయాలతో పంటలు పండించే సేంద్రియ వ్యవసాయం పై అవగాహన పెంచుకోవాలని అన్నారు.వారు ఈ సందర్భంగా జీవమృతం తయారుచేయు విధానం మరియు దాని యొక్క ఉపయోగాలు గురించి రైతులకు సువీవరంగా వివరించారు.అన్నపురెడ్డిపల్లి మండల వ్యవసాయ అధికారి అనూష మాట్లాడుతూ రైతులందరు రసాయన ఎరువుల వాడకం క్రమేపి తగ్గించుకుంటు, ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని అన్నారు.యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కో ఆర్డినేటర్ నాగేంద్ర, రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే లాభాలు గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో వైడిఓ ఆర్గనైజేషన్ డైరెక్టర్ కృష్ణ, అన్నపురెడ్డిపల్లి మండల వ్యవసాయ అధికారి అనూష,వైడిఓ కో ఆర్డినేటర్ నాగేంద్ర,వైడిఓ అన్నపురెడ్డిపల్లి మండల ఆర్గనైజర్ నాగరాజు, వైడిఓ ఆర్గనైజేషన్ సిబ్బంది మరియు రైతులు ఉన్నారు.

Share it:

Post A Comment: