CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సైనిక్ స్కూల్ పోటీపరీక్షల్లో అర్హత సాధించిన బి తేజేశ్వర్ ను అభినందించిన ఎస్ఐ శ్రీకాంత్..

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయి ఎక్సెలెంట్ స్కూల్ విద్యార్దులు పోటీపరీక్షల్లో దూసుకు వెళ్తున్నారు. సైనిక్ స్కూల్ నందు ఆరవ తరగతి అర్హత పరీక్షలో విజయం సాధించి సైనిక్ స్కూల్లో అడుగుపెడుతున్న సాయి ఎక్సెలెంట్ స్కూల్ విద్యార్థి భానోత్ తేజేశ్వర్ ను స్థానిక ఎస్ఐ పి.శ్రీకాంత్, గురువారం అభినందించారు. మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా సాయి ఎక్సెలెంట్ స్కూల్ కరస్పాండెంట్ ఆరెబోయిన కృష్ణ ప్రసాద్ (కెపి) మాట్లాడుతూ.. మా స్కూల్ నందు చదువుతున్న బానోత్ సురేష్ బాబు, మాధవి దంపతుల కుమారుడు భానోత్ తేజేశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయనగరం జిల్లా, కోరుకొండ సైనిక్ స్కూల్ నందు ఆరవ తరగతి ప్రవేశ పోటీ పరీక్షలలో విజయం సాధించి, సైనిక్ స్కూల్ అనుబంధ పాఠశాల అయిన తెలంగాణ రాష్ట్రం లోని, వరంగల్ అశోక్ నగర్ పరిధిలో ఉన్న సైనిక్ స్కూల్లో ఆరవ తరగతిలో ప్రవేశించాడని తెలిపారు. సాయి ఎక్సెలెంట్ స్కూల్ నందు ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకుల పాఠశాల లకు మరియు నవోదయ విశ్వవిద్యాలయాలకు, సైనిక్ స్కూల్ కు చేరే విధంగా పోటీ పరీక్షలకు అతి తక్కువ ఖర్చుతో కోచింగ్ ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు సురేష్ బాబు, మాధవి మాట్లాడుతూ.. సాయి ఎక్సెలెంట్ స్కూల్ నందు తేజేశ్వర్ ఒకటవ తరగతి నుండి ఐదోవ తరగతి వరకు చదువుకున్నాడని, సాయి ఎక్సెలెంట్ స్కూల్ కరస్పాండెంట్ ఆరెబోయిన కృష్ణ ప్రసాద్ ప్రోత్సాహం తో పోటీ పరీక్షలలో విజయం సాదించాడని, అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

Post A Comment: