మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి.
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 14 (మన్యం టీవీ) : మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మంగళవారం మున్సిపల్ పరిధిలో గల 27వ వార్డు నందు ఏ పవర్ బస్తిలో ఉన్న మినీ బృహత్ పట్టణ ప్రకృతి వనంను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సీతాలక్ష్మి మాట్లాడుతూ మొక్కల చుట్టూ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ప్రజలతో చుట్టూ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా మొక్కలను సంరక్షించాలని ఇది మనందరి బాధ్యత అని అక్కడున్న స్థానికులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వేముల ప్రసాద్ బాబు, తహశీల్దార్ రామకృష్ణ, డిఇ నవీస్, ఏఇ సాహితీ, రాము, టిపీఓ ప్రభాకర్, ఆస్ట్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వీరభద్రాచారి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: