మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో "బృహత్ పల్లె ప్రకృతి వనం" కోసం కేటాయించిన పది ఎకరాల ప్రభుత్వ భూమిలో జరుగుతున్న పనులను శుక్రవారం డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు మరియు మండల స్పెషల్ ఆఫీసర్ భీమ్లా నాయక్ పరిశీలించారు. వారం రోజుల్లో ల్యాండ్ డెవలప్మెంట్ పనులన్నీ పూర్తి చేసుకుని ప్లాంటేషన్ మొదలు పెట్టాలని సంబంధిత మండల అధికారులను ఆదేశించారు. తొమ్మిది ఎకరాలలో సుమారుగా 40 వేల వివిధ రకాల మొక్కలను నాటనునట్లు తెలిపారు. ఒక ఎకరంలో చిల్డ్రన్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వనం చుట్టూ వాకింగ్ పాత్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దీని కోసం 300 మంది కూలీలతో ప్లాంటేషన్ కోసం గుంతలు, తదితర పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ రామారావు, ఏ పీ ఓ సుహాసిని, ఈసీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: