చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:
చండ్రుగొండ మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీ పరిధిలో గల రహదారులను బురదమయం కావడంతో గ్రామస్తులు వరి నారు ను తీసుకొచ్చి శుక్రవారం రహదారిపై వరినాట్లు వేశారు. తమ గోడు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని చేసేదిలేక రహదారుల అధికారులకు తెలియాలని తాపత్రయంతో దారులపై నాట్లు వేసి నిరసన తెలిపినట్లు గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి బురదమయంగా మారిన రహదారులపై గ్రావెల్ పోసి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post A Comment: