మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబరు 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాగు, తుమ్మలవాగు బ్రిడ్జి పై నుండి సుమారు నాలుగడుగులు పైన ఉదృతంగా నీరు ప్రవహించడంతో సుమారు పది, పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు రాకపోకలకు కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది. తుమ్మలవాగు లో ద్విచక్ర వాహనదారుడు ప్రవాహ ఉధృతికి అదుపుతప్పి వాగులో పడిపోగా అక్కడ ఉన్న యువకులు వెంటనే స్పందించి పడ్డ వ్యక్తిని బండిని చాకచక్యంగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది.
Post A Comment: