దబ్బగట్ల సుమన్ ఏ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరునాగారం ఐటిడిఎ పరిధి లోని 29 శాఖ లలో పలు శాఖ లను ఇతర ప్రాంతాలకు తరలించారని, ఐటీడీఏ లో 60% ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని వాటిని అడ్డుకోవడం లో స్థానిక యం ఎల్ ఏ సీతక్క ఏ మాత్రం ప్రయత్నించండం లేదని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ర్ట అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ ఆరోపించారు. ఐటీడీఏ ఏటూరునాగారం రెండు జిల్లాల పరిధిలో (ములుగులో) ఉందని స్థానిక ఎంఎల్ ఏ సీతక్క పాలక మండలి సమావేశానికి తప్ప మిగతా సందర్భాలలో ఐటీడీఏ మెట్లు ఎక్కిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.ములుగు జిల్లాలో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.వారి గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల సమయంలో నే ఆదివాసీలు గుర్తుకు వస్తున్నారని,మిగతా సమయంలో ఆదివాసీల గురించి పట్టించుకోవడం లేదన్నారు.ఏటూరునాగారం మండల కేంద్రం లో నిబంధనల కు విరుద్ధంగా ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్న మాట్లాడటం లేదని,ఆదివాసీల కు రైతు బంధు రాకున్నా స్పందించడం లేదని,ఏజెన్సీ లో రోడ్ల మరమ్మతులు చేయించడం లేదని అన్నారు. ఇప్పటికైనా సీతక్క స్పందించి ఐటీడీఏ బలోపేతం పై శ్రద్ద వహించి,ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, రామన్న,సమ్మయ్య పాల్గొన్నారు.
Post A Comment: