మన్యంటీవి, దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో కదంతొక్కిన మండల పంచాయతీ వర్కర్స్,
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, ఈరోజు దమ్మపేట మండల గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రతి పంచాయతీ కార్మికులకు ఇరవై నాలుగు వేలు వేతనం ఇవ్వాలని, అధికారుల వేధింపులు విరమించాలని, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని వివిధ సమస్యలపై కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అనుబంధ మండల అధ్యక్షుడు పందేటి చెన్నారావు, కార్యదర్శి పేరుమల్ల రాంబాబు, గొర్రెపాటి బసవయ్య, ధర్మారావు, ప్రభాకర్, ధర్మయ్య, నాగమణి, దమ్మపేట మండలంలో వున్నా 31 గ్రామ పంచాయతీ వర్కర్స్ కార్మికులు అందరు పాల్గొన్నారు.
Post A Comment: