CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనారోగ్యంతో ఉన్న పాత్రికేయునికి ఆర్ధిక సహాయం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట పత్రిక విలేకరి జానపట్ల జయరాజు ఇటీవల అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న అంబేద్కర్ సంఘం నాయకులు సోమవారం రోజు అతని స్వగ్రామం అయిన రమణక్కపేటకు వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని బియ్యం మరియు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న దళిత కుటుంబాలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దళిత బంధు అమలు చేయాలని దీని వల్ల దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, పల్లికొండ యాదగిరి, గంగెర్లి రాజరత్నం , ఎల్ పి ముత్యాలు, వీరస్వామి, బసారి కారి నాగార్జున,కర్రీ రామ్మోహన్,బోడ పరదేశ్, శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: