మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చనుమోలు వెంకన్న ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ
పురస్కార గ్రహీత సంపత్ కుమార్
దంపతులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కాకర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి
కొలిపాక చంద్రశేఖర్, గౌరవ సలహాదారు
మోదుగు ప్రభాకర్, ప్రచార కార్యదర్శి షేక్
షఫీ, సహాయ కార్యదర్శులు షేక్ సిద్దిక్,
సంఘం నాగరాజు, సభ్యులు బుడెన్
పాషా, రత్న కుమార్, రమేష్, యూసుఫ్,
వీరన్న, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: