మన్యం టివి;ములకలపల్లి ప్రతినిధి:
మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెటేటి నర్సింహా రావు ఆధ్వర్యంలో
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చేపడుతున్న దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాన్ని మండలకేంద్రం లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
రాష్ట్రము లో దళిత,గిరిజన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు చేయాలని,దళిత,గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఎస్సి, ఏస్టి నిధులు పూర్తిస్థాయిలో
వినియోగించాలని,119 నియోజక వర్గాలలో దళిత బంధుతో ,పాటు గిరిజన బంధు కూడా అమలు చేయాలనీ,దళితుడికి మూడు ఎకరాల భూమి ,మరియు గిరిజన పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని,
నియోజకవర్గ ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని,విజ్ఞప్తి చేస్తూ ఎం ఆర్ వో ఎల్ వీరభద్రం కి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్య క్రమంలో లింగోజి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గురజాల,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెటేటి నర్సింహారావు,ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి,అశ్వారావుపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరంపల్లి చెన్నారవు,పూసుగుడెం సర్పంచ్ భానోతు విజయ,ఐ ఎన్ సి నాయకులు కట్రామ్ నరసింహారావు, కిసాన్ సెల్జిల్లా అధ్యక్షులు
ఏలూరుకోటేశ్వరరావు,వెంకట్,భాను,
తాండ్ర ప్రభాకర్ రావు,ఎం.డి అంజూమ్,బుగ్గారపు సత్యనారాయణ,పుష్పాల హనుమతురావు,కొప్పుల రాంబాబు,అనుమల నర్సింహారావు,పాలకుర్తి రత్నభూషణం,పాలకుర్తి రవి,మడకం శ్రీను,సొడే కళ్యాణ్,పార్టీ కార్యకర్తలు
తదితరులు పాలొగొన్నారు.
Post A Comment: