మన్యం టీవీ ఏటూరు నాగారం
హైదరాబాదులో ఐదు రోజుల క్రితం ఓ మృగాడు చేతిలో అత్యాచారం కు బలైన ఆరేళ్ళ చిన్నారి చైత్ర కి ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ కార్యాలయం నుండి శివాలయం గుడి వరకు సోమవారం సాయంత్రం తుడుం దెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు పులిసే బాలకృష్ణ పిలుపుమేరకు,పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు.ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలువురు యువతీ యువకులు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ తో నినాదాలు చేస్తూ చిన్నారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా ఇలాంటి రాక్షసులకు విచారణ జరిపి బహిరంగంగా ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
Post A Comment: