మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమం నడిపిన ప్రజావాది పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు,నిజాం దమన నీతికి నిరంకుశత్వానికి అరాచక పాలనకి వ్యతిరేకంగా తన కలంతో సమాధానం చెప్పిన వ్యక్తి.స్వాతంత్ర్య సమర యోధుడు,తెలంగాణ ఉద్యమకారుడు ప్రజా కవి శ్రీ కాళోజి నారాయణ జయంతి ని పురస్కరించుకొని ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్ పర్సన్ ములుగు నియోజక వర్గ దళిత గిరిజన దండోరా ఇంచార్జి కూచన రవళి రెడ్డి,ములుగు జిల్లా మత్స్య పారిశ్రామిక కాంగ్రెస్ అధ్యక్షులు కంబాల రవి,ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి చాంద్ పాషా,ములుగు యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంగోత్ వంశీకృష్ణ,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు, ములుగు జిల్లా మత్స్య పారిశ్రామిక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొండబోయిన శంకర్,జీవంతరావు పల్లి సర్పంచ్ రత్నం భద్రయ్య,మత్స్య పారిశ్రామిక ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పొలు రవి,మైనారిటీ సెల్ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు హైమద్,కాంగ్రెస్ నాయకులు మేడం రమణా కర్,కొండ బోయిన సుధాకర్,మహిళా నాయకురాలు పోలేబొయిన సృజన తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: