మన్యం టీవీ చర్ల: చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవం ను ప్రిన్సిపాల్ సత్యనారాయణ అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు యొక్క గొప్పతనాన్ని తెలంగాణ భాషకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో వ్యక్తుల యొక్క బతుకు సూత్రములను తెలిపిన మహానుభావుడుగా మరియు ఆత్మ గౌరవం యొక్క విలువను తెలిపిన వ్యక్తి అని అన్నారు. తర్వాత కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ లైబ్రరీ చలం, అధ్యాపకులు ప్రసాద్, అమృత రావు ,కొండల రావు, కృష్ణ సుధాకర్, రమేష్, నాగరాజు ,వీరభద్రం ,రామారావు ,బాబు ,లక్ష్మణ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: