👉అన్ని పరీక్షలకూ కావాల్సిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
👉ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం మానుకోవాలి
👉ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం టీవి, మణుగూరు:
మణుగూరు మండలం లో 100 పడకల ఆసుపత్రి నా కృషితోనే సాధ్యమైందని, సేవలు కూడా ప్రారంభమయ్యాయని తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ప్రతిపక్షాలు పనికిరాని వాదనలు చేస్తూ, కాలం వెళ్లబుచ్చుతున్నారని, నియోజకవర్గ పరంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు సహకరించాలి తప్ప పనికిరాని వాదనలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వంద పడకల ఆసుపత్రికి సేవలు ప్రారంభించిన రోజే డెంగ్యూ పరీక్ష కు, ఈసీజీ పరీక్ష కు సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉంచామని, రాబోయే వారం రోజుల్లో ఈ పరీక్షలకు సంబంధించిన టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉంటాడు అని, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలని తెలియజేయడం జరిగింది
Post A Comment: