CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిందితున్ని ఫోక్సో చట్టం ద్వారా శిక్షించాలి

Share it:

 



*చైత్ర కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.

*తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివ కుమార్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

మండల కేంద్రంలో స్థానిక విలేఖర్ల సమావేశంలో తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ఉప ఆద్యక్షుడు గంపల శివ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాదులోని సింగరేణి కాలనీ లో ఉన్నటువంటి ఆరు సంవత్సరాలు గల చైత్ర అనే ఒక పసిపాప పై రాజు అనే ఒక కామాంధుడు అత్యాచారం చేసి,అతి దారుణంగా హత్య చేసాడు.అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. పుట్టిన పసిపాప నుంచి చనిపోయే వయస్సు లో ఉన్న ముసలి వాళ్ల పై కూడా ఈ అత్యాచారాలు,హత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆడపిల్లల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని చెప్పే ప్రభుత్వాలు,ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి దుర్మార్గపు చర్యలు రాష్ట్రంలో జరుగుతున్నాయని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా ఆడపిల్లల రక్షణ కోసం ఉన్న చట్టాలను దేశంలో,రాష్ట్రంలో పగడ్బందీగా అమలు చెయ్యాలని అన్నారు.చైత్ర అనే పసి పాప పై అత్యాచారం చేసిన నిందితుడిని ఫోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలి.చైత్ర కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

ఆపసిపాప కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Share it:

Post A Comment: