భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 12 (మన్యం టీవీ) శనివారం నాడు కొత్తగూడెం అంబేద్కర్ భవన్ లో జరిగిన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ ప్రశంశా పత్రాలు అందజేయడానికి వచ్చిన స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు - మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి, స్థానిక కౌన్సిలర్ ప్రసాద్ అంబేద్కర్ భవన్ ప్రహరీ కోసం నిధులు 14 లక్షలు అందజేసిన తరువాత ప్రహరీ అంత పూర్తి అయినా తరువాత మొదటి సరిగా అంబేద్కర్ భవనానికి వచ్చి ఎమ్మెల్యే వనమా అంబేద్కర్ భవన్ చుట్టూ కాంపౌండ్ వాల్ ను పరిశీలించారు. మిగిలిన ప్రహరీ గోడని మరియు నాలుగు గేట్లను తొందరగా పని పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించి మున్సిపల్ చైర్ పర్సన్ స్థానిక కౌన్సిలర్ త్వరగా పనులు పూర్తి చేపిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమనికి విచ్చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు ని పూల మాల తో మరియు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో అంబెడ్కర్ భవన్ డవలప్ మెంట్ సోసైటీ చైర్మన్ కూసపాటి శ్రీనివాస్,
మాల మహానాడు నాయకులు గడిపెల్లి శ్రీనివాస్,
టి ఎన్ ఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండా రమేష్,
మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కూరపాటి రవీందర్,
టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగిలి,
మాలమహానాడు జిల్లా మహిళ నాయరాలు నక్క సృజన,
మెరుగు చింటూ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: