CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాల్ చైర్పర్సన్ కాపు సీతా లక్ష్మి.

Share it:

 


ఆదివారం నాడు పురపాలక - ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, సూచనల మేరకు పది గంటల కు పదినిమిషాల ప్రోగ్రాం లో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు లో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తన ఇంటి పరిసరాలలో ఉన్న చెత్త మొక్కలను తొలగిస్తూ ఇంట్లోని ఏసీ, ఫ్రీడ్జ్ ,కూలర్లు శుభ్రం చేశారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న పూల కుండీలలో, మంచినీటి హౌజ్ లలో,టైర్లలో నీరు ఉన్న వాటిని పారబోయడం జరిగిందనీ. ఈ వర్షాకాల సీజన్లో విపరీతంగా డెంగ్యూ ,మలేరియా, టైఫాయిడ్ ఇతర వైరస్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నయ్ అందువల్ల చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం వలన కొంతమేర నివారణ జరుగుతుందని వార్డు ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. అలాగే నేషనల్ హైవే పక్కన ఉన్న కాల్వలను దగ్గర ఉండి క్లీన్ చేయించారు. నీరు నిల్వ ఉన్న  నీటి గుంటలలో స్వయంగా ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఆయిల్ బాల్స్ వేయడం వలన  కొంతమేర దోమల ఉత్పత్తి జరక్కుండా చేయవచ్చని అలాగే కొత్తగూడెం మునిసిపాలిటీ లోని ప్రతి ఒక్కరు  ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు శుభ్రం చేయాలని  ప్రజలను కోరడం జరిగింది. వీరి వెంట టీబీజీకేఎస్  లెవెల్ మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ ,సత్యనారాయణ ,మోహినుద్దీన్, షరీఫ్ , శిరీష,సలీం ,రామారావు, కాజా ఉన్నారు.

Share it:

Post A Comment: