భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 12 (మన్యం టీవీ) ఆదివారం పాల్వంచ మండలం పాల కొయ్య తండా డాన్స్ మాస్టర్ మరియు డప్పు కళాకారుడు వి.రాములు "జానకిరామ్" కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘ(టివిపిఎస్) సభ్యులు వారికి నిత్యవసర వస్తువులు,కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా టివిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు,విజేఏసి చైర్మన్ సతీష్ గుండపునేని మాట్లాడుతూ, ప్రభుత్వము కళాకారులను ఆదుకోవాలని కరోనా మొదటి, రెండో దశ తర్వాత కళాకారుల జీవితం మరింత దౌర్భాగ్యం గా మారిందని, చాలా మంది కళాకారులు పనులు లేక ఆదరణ కరువై పస్తులతో కాలం వెల్ల తీస్తున్నారని వీటికి తోడు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలని, వారికి ఈ కష్టకాలంలో కనీసo 10వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తూ ఆ కుటుంబాలకు జీవితం అందించి ఈ కష్టకాలంలో ఆసరాగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విజేఏసి జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు, పాల్వంచ మండల అధ్యక్షులు అబ్దుల్ నాయీమ్,సభ్యులు రాములు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: