మన్యం టీవీ, అశ్వాపురం:వాతావరణ శాఖ ద్వారా అందిన సమాచారం మేరకు ఈరోజు, రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అశ్వాపురం మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు. కావున ప్రజలందరూ అప్రమత్తంగాఉండాలి.అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు వాగుల దాటే ప్రయత్నం చేయవద్దు. వ్రేలాడుతున్న విద్యుత్ తీగల పట్ల, తక్కువ ఎత్తు లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహాయాన్ని తీసుకోగలరు అశ్వాపురం సిఐ సట్ల రాజు తెలిపారు.
Post A Comment: