CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ మాజీ ఎంపీపీ గుగులోతు బాలునాయక్, మండల ప్రధాన కార్యదర్శి చీదెళ్ళ పవన్ కుటుంబాలకు అండగా ఉంటాం..... మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.....

Share it:


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: టిఆర్ఎస్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.సోమవారం చండ్రుగొండ చెందిన మండల ప్రధాన కార్యదర్శి చీదెళ్ళ పవన్ కుమార్ తల్లి చీదెళ్ళ లక్ష్మి (75) కి తుంగారం గ్రామపంచాయతీ టేకుల బంజర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బాలు నాయక్(45) చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పునాదిరాళ్లు నీ వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.ఆయన వెంట టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్య నాయక్, ఉపాధ్యక్షుడు ఉత్పల ఏడుకొండలు, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వర్లు,ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపి సత్యనారాయణ, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, గానుగుపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జడ వెంకయ్య, మేడ మోహన్ రావు, రసూల్, ఎంపీటీసీ దార బాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: