దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కో- ఆర్డినేటర్ సుదర్శన్ ప్రసాద్ తివారి
మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని
ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గొడిశాల రామనాధం ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టి పి సి సి కార్యదర్శి, పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ సుదర్శన్ ప్రసాద్ తివారి పాల్గోన్నారు.
ఈ సందర్భంగా సుదర్శన్ ప్రసాద్ తివారి మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గం లో ఏ మండలం లో కూడా దళితులకు కానీ, గిరిజనులకు కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది అని, ఒక గిరిజన ఎమ్మెల్యే అయ్యుండి గిరిజనులకు చేసిన న్యాయం ఏంటి అని, ప్రశ్నించారు.
దళితులకి మూడెకరాల భూమి, గిరిజనులకు పోడు భూములకు పట్టాలు లాంటి ఎన్నో హామీలు చేశారు, కానీ ఇప్పటివరకు ఎటువంటి హామీ కూడా నెరవేర్చలేదు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షులు తరుణ్ మిత్ర, జిల్లా కిసాన్ కాంగ్రెస్ కార్యదర్శి కొమరం రాంబాబు, నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బోడ రమేష్, పినపాక వార్డ్ మెంబెర్ తోకల సమ్మక్క, మండల నాయకులు పూనెం వెంకటేష్, కొమరం వెంకటేశ్వర్లు, తోకల సాంబయ్య,గీద సాయి, జరుపుల.రాము, పొనుగోటి పూర్ణ చందరావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: