సెప్టెంబర్ 24
మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఈనెల 24 న జరిగే స్కీం వర్కర్ల స్కీం వర్కర్ల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ..ఆశా వర్కర్లు కోమరారం, రొంపెడు, సులానగర్,ఇల్లందు యూ హెచ్ సీ లలో ఈ నెల 24న జరిగే సమ్మెలో పాల్గొంటామని సమ్మె నోటీసులు అధికారులకు సమర్పించడం జరిగింది. అనంతరం జరిగిన సభలో సీఐటీయూ ఇల్లందు ఏరియా కన్వీనర్ అబ్దుల్ నబి, భూ నిర్వాసితుల సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా ఉండి పనిచేస్తున్న ఆశాలు, అంగన్ వాడి,మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీ వో ఏ లు, గౌరవ వేతనం తో పనిచేస్తున్నారు వారికి కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని,వారితో వెట్టి చాకిరీ చేస్తున్నారని అన్నారు.అందుకని దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఆలేటి కిరణ్ కుమార్,చీమల రమణ, కడుదుల వీరన్న, స్వప్న, రాద,చంద్రకళ,కమల,విజయ,హైమావతి, మాదవి,లక్ష్మీ,మంగతాయి,మల్లేశ్వరి,ఈశ్వరి,లక్ష్మీ,ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: