CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ట్రాన్స్ఫార్మర్ కు త్వరగా మరమ్మత్తులు చేయండి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నర్సాపూర్(పిఏ) శివారులో చింతల గుంపు పరిధిలో బుధవారం ఉదయం  సమయంలో విద్యుత్ స్తంభం విరిగి ట్రాన్స్ఫార్మర్ కూలి నేలమట్టమైంది.దీంతో త్రుటిలో ప్రమాదం తప్పిందని,గతంలో విద్యుత్ వైర్లు తెగి కల్తీ మల్లయ్య అనే ఆదివాసీ గిరిజన రైతు దుక్కిటెద్దు మృతి చెందిందని నాలి నరసయ్య, నాలి కృష్ణ, గడ్డం సత్యం, సునారికాని రాములు అనే రైతులు ఆవేదన చెందుతున్నారు.విద్యుత్తు లైను గత 40 సంవత్సరాల క్రితం వేసిన లైన్ అని చాలా పురాతనమైనదని దీన్ని మార్చి కొత్త లైను చేయాలని,విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.  ఉన్నతాధికారులు స్పందించి నర్సాపూర్ శివారు లో గల చింతలగుంపు పరిధిలోగల విద్యుత్ లైను వెంటనే పునరుద్ధరించాలని ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు.

Share it:

Post A Comment: