వైద్యాధికారి పర్షియా నాయక్
రక్త పరీక్షలు చేయించుకున్న విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు .
మన్యం మనుగడ, కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య పరీక్షలు అయిన మలేరియా,టైపాయిడ్, డెంగ్యూ లాంటి రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పర్షియా నాయక్ బుధవారం తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో, మండల వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మలేరియా, టైపాయిడ్, డెంగ్యూ రక్త పరీక్షలు పీహెచ్ సీలో చేసుకున్నారని తెలిపారు.అలాగే దగ్గు,జలుబు,జ్వర వంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని అన్నారు.
Post A Comment: