మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కామారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోర్నిబెల్లి లక్ష్మీ నర్సయ్య తండ్రి కొర్నిబెల్లీ కిషన్ రావు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు.బుధవారం వారి దశ దిన ఖర్మకు హాజరైన ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి వారి కుటుంబానికి అండగా నిలిచి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి,వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మరియు నేను ఎల్లవేళల అండగా ఉంటామని,అలాగే ఏ సమస్య వచ్చిన వారి కుటుంబ సభ్యులకు నేను అందుబాటులో ఉంటానని అన్నారు.ఈ
కార్యక్రమంలో మండల అధ్యక్షులు జాలపు ఆనంతరెడ్డి,మాజీ జడ్పీటీసీ బొల్లు దేవేందర్,సహకార సంఘ అధ్యక్షులు పులి సంపత్,మాజీ సింగల్ విండో అధ్యక్షులు సాంబయ్య, కామరం సర్పంచ్ రేగా కల్యాణి, మండల మహిళ అధ్యక్షులు నాగమణి, వీరేశం, కోటేశ్వరరావు,భూపతి జనార్దన్,పీరీల వెంకన్న, రంగాపూర్ సర్పంచ్ సూర్య నారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: