మన్యం మీడియా/ అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి(సెప్టెంబర్-15):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ లింగోజీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, యువకులు ముట్టడించి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ యూత్ జెండాను ఎగరవేసి క్యాంపు కార్యాలయంపై రాళ్ల తో దాడి చేశారు.అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటు ముందు బేటాయించి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తెలుగుదేశం పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ, మెచ్చా నాగేశ్వరరావు రాజీనామా చేయాలంటూ నిరసనలు తెలియజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై రాళ్ల తో దాడికి పాల్పడినందుకు, స్థానిక పోలీసులు 24 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించగా, యువజన కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గురజాల వెంకట్ మరియు యువజన కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు కోరంపల్లి చెన్నారావు. ఇరువురిని దమ్మపేట పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ నాయకుడు-రామిశెట్టి మనోహర్ నాయుడు,యువజన కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు-గురజాల వెంకట్, కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి-మాసనపల్లి లింగోజీ, యువజన కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు-కోరంపల్లి చెన్నారావు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు-సున్నం నాగమణి, కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షుడు బాణావత్ భీముడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు-చల్లా పుల్లయ్య, ముద్రగడ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Post A Comment: