CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సోయం వీరభద్రం ను సత్కరించిన ఆదివాసి యువ నాయకులు

Share it:

 


మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజక వర్గ ప్రతినిధి:: తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో కన్వీనర్ సోయం వీరభద్రం. రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప గొప్ప పదవులు చేపట్టాలని.ఆదివాసీ గిరిజన నాయకులుగా గిరిజనులకు ప్రజా సేవ చేయాలని. పార్టీ సిద్ధాంతాలు వేరే అయినప్పటికీ ఆదివాసి జాతి ఐక్యత, సంస్కృతి-సంప్రదాయాలు, ఆచారాలు, హక్కులు, చట్టాల అమలుకు కృషి చేయాలని కోరుతూ దమ్మపేట మండలం, కొమ్ముగూడెం గ్రామంలో వారి స్వగృహం నందు ఆదివాసీ యువ నాయకులు సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసి సంఘాల నాయకులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి మన గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ వైద్యం, విద్య, ఉపాధి, అభివృద్ధి సంక్షేమాల కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి యువ నాయకులు ఆరేం ప్రశాంత్, కాకా శివశంకర్, ప్రసాద్, వాడే ప్రవీణ్ కుమార్, వాడే వీరస్వామి, తాటి రవీంద్ర, తదితరులు ఉన్నారు.

Share it:

Post A Comment: