మన్యం టీవీ చర్ల: చర్ల మండలం గోమ్ముగూడెం గ్రామానికి చెందిన నంకపాప కనకయ్య(70) గోదావరి లో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఉదయం చేపల వల తీసుకొని గోదావరి చేపల వేటకు వెళ్లిన కనకయ్య గోదావరిలోని కనుమరుగయ్యారు. గోమ్ముగూడెం గ్రామ సమీపంలో ఉన్న గోదావరి వద్ద నావ సహాయంతో గోదావరిలో కు వెళ్లి చేపల కోసం వల విసిరాడు. వల చిక్కుకోవడంతో నావ నుంచి దిగి ఈదుకుంటూ వల తీద్దాం అనుకునేలోపే గోదావరిలో ప్రవాహంలో మునిగిపోయాడు. ఇది గమనించిన పశువుల కాపరి వాళ్ళు అరుస్తూ వచ్చేలోపే కనకయ్య మునిగిపోయాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆక్కడికి హుటాహుటిన వచ్చి గజ ఈతగాళ్లు మరియు చేపలు పట్టే వాళ్ళు సహాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.
Post A Comment: