CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జడ్పీటీసీ గారి విన్నపం పట్ల స్పందించిన ఐ టి సి యాజమాన్యం

Share it:

 


బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో ఉన్న ITC-PSPD కర్మాగారానికి సంబంధించిన గోదాంలకి లక్ష్మీపురం నుంచి గుట్ట లక్ష్మీపురం నిత్యం 40 టన్నుల పైబడి లోడ్ లారీలు వెళ్లడం వల్ల పెద్ద పెద్ద గుంతలు పడడంతో గ్రామస్తులు,రైతులు,కార్మికులు నిన్న పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేయడంతో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత గారు వచ్చి ఆందోళన చేసిన వారితో మాట్లాడి ఈ సమస్యని ఐ టి సి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో ఈరోజు ఐ టి సి యాజమాన్యం ఐ టి సి అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెంగల్ రావు గారిని లక్ష్మీపురం పంపించడం జరిగింది.అనంతరం జడ్పీటిసి శ్రీలత గారు,చెంగల్ రావు గారు గుంతలు పడిన రోడ్డుని పరిశీలించారు.గుంతలు పడిన ప్రాంతాల్లో ప్రస్తుతం వాహనదారులు,ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా పి జి పొపించి,అనంతరం ఐ టి సి పై అధికారులతో మాట్లాడి సీసీ రోడ్డు వేసేలా మాట్లాడుతా అని చెంగల్ రావు గారు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోంపాక నాగమణి గారు,స్థానిక వార్డ్ సభ్యులు పాలం దివాకర్ రెడ్డి గారు,స్థానిక తెరాస నాయకులు బోళ్ల వెంకన్న గారు,కృష్ణ గారు,తిరుపతి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: