*సెప్టెంబర్ 07 జరుగు జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి.
*ఏటూరు నాగారం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో గల ఏటూరు నాగారం,మరియు కన్నాయిగూడెం మండలలోగల గిరిజన యువతి యువకులు ఏటూరు నాగారం ఐటిడిఏ ఆధ్వర్యంలో ఈనెల 07-09-2021 కన్నాయిగూడెం మండల కేంద్రంలో రైతు వేదిక హాల్ నందు నిర్వహించే ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్టు అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ ఉద్యోగ మేళ లో జుమోటో, పేటమ్,కే స్, బేకరీస్,రక్షణ సెక్యూరిటీ ఫ్లిప్ కార్ట్, స్నేడేర్, సంబంధించిన కంపెనీస్ పాల్గొంటున్నాయని,యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు జరుగు వివిధ రకాల ఉచిత కోర్సులకు సెలక్షన్ నిర్వహించబడుతుంది అన్నారు. పదో తరగతి నుండి డిగ్రీ చదివి ఉండాలని,18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని ఆసక్తిగల అభ్యర్థులు కన్నాయిగూడెం మండలంలో రైతు వేదిక నందు జరుగు ఎలక్షన్లో పాల్గొన వలసిందిగా ప్రాజెక్టు అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Post A Comment: