CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దగ్ధం🔥🔥🔥

Share it:

 


👉సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసనల వెల్లువ✊✊✊✊

మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలం,బుచ్చన్నగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ,సిపిఎం పార్టీ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు...

సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరల భారాన్ని సామాన్య ప్రజలపై మోపి,కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చిందని.రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని వ్యవసాయ భూముల నుంచి దూరం చేస్తుందని.మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వటమే తప్ప రైతాంగానికి,కార్మికులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించడం లేదని ఎద్దవ చేశారు.నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా ఉద్యమాల ద్వారానే మార్చాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అన్నపరెడ్డిపల్లి మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం,సిపిఎం పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు తాటి సూర్యం,సవలం కృష్ణ,సిపిఎం పార్టీ బుచ్చన్నగూడెం గ్రామ శాఖ కార్యదర్శి మడివి నాగరాజు,తాటి ముత్యాలు,ఎం వెంకన్న,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: