మన్యం టివీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచారు.రైతు వ్యతిరేక చట్టాలను చేవడం తో పాటు నూతన విద్యుత్ విధానాన్ని, కార్మిక చట్టాలను రద్దు చేసి 4కోడ్ తెచ్చారు.ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అమ్మజూస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ దారిలోనే నడుస్తూ పేదలను మరింత పేదలుగా మారుస్తున్నారు.ధరలు విపరీతంగా పెరిగి పట్టించుకోవడం లేదు రెండు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ రాజీవ్ నగర్ శాఖ పరిధిలో ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా సీపీఎం పార్టీ నాయకులు అబ్దుల్ నబి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో దరావత్ రాందాస్, రమేష్,శంకర్,ఉపేందర్,లక్ష్మణ్,భద్రయ్య,కాంతి,లలిత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: