*మర్యాదపూర్వకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కలిసిన జడ్పీ చైర్మన్.
మన్యం టీవీ ఏటూరు నాగారం
హన్మకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్,క్యాంపు కార్యాలయంలో శనివారం పంచాయతీ రాజ్ శాఖ,గ్రామీణ అభివృద్ధి,నీటి సరఫరా శాఖల మాత్యులు ఎర్రబెల్లి దయాకరరావుని ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ కలిశారు.ముఖ్యమంత్రి,పార్టీ అధ్యక్షులుకేసీఆర్,కార్యనిర్వాహక పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు ములుగు నియోజకవర్గంలో సంస్థాగతంగా నిర్మాణా గ్రామ,మండల,పట్టణ,జిల్లా స్థాయి కమిటీల పైన మంత్రి దయాకరరావు తో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చర్చించారు.
ములుగు జిల్లా అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేసి సహకారాన్ని అందించాలి అని కోరారు.ములుగు జిల్లా అభివృద్ధి కోసం,కార్యకర్తల శ్రేయస్కరం కోసం ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ సూచనల మేరకు తప్పకుండా జిల్లా అభివృద్ధికి సహకరిస్తాను అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
Post A Comment: