గుండాల /ఆళ్ల పల్లి సెప్టెంబర్ 29( మన్యం మనుగడ) డెంగ్యూ జ్వరంతో మంగళవారం మండల కేంద్రానికి చెందిన పానుగంటి నాగేశ్వరరావు మృతి చేందటంతోకొత్తగూడెం జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి సాబీర్ పాషా బుధవారం ఆళ పల్లి గ్రామం లోని నాగేశ్వరరావు స్వగృహానికి వచ్చి పూలమాలవేసి నివాళులర్పించారు. నాగేశ్వరరావు గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారు అన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా చిరస్మరణీయంగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య , న్యూ డెమోక్రసీ నాయకులు బత్తిని సత్యం, బూరుగడ్డ నాగేశ్వరరావు, బూరుగడ్డ సతీష్ తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: