మన్యం టీవి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట 73 వ వార్షికోత్సవం సందర్బంగా దమ్మపేటస్థానిక సిపిఐ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరియు తెలంగాణ పోరాటయోధులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పండూరివీరబాబు, తంగేళ్లమూడి శివకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు నాయకులు ప్రాణాలర్పించి విమోచన కల్పించి భారతదేశంలో విలీనం చేసినారని తెలంగాణ సాయుధ పోరాటం సుమారు 4,600 మంది అమరులైన వారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని, మరో తెలంగాణ పోరాటానికి సిద్ధం కావాలని, దొర పాలనను అంతం చేయాలంటే మరో తెలంగాణ పోరాటాన్ని సిపిఐ కార్యకర్తలు సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లబోతుల నాగార్జున, నరసింహారావు, ధర్మ, జన్ బి శేషు కుమారి, లక్ష్మి, జాను, నక్క నాగమణి, గాజుల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: