మాన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో
పర్ణశాల గ్రామంలో గుగులోతు రాము 42 వయస్సు రెవిన్యూ డిపార్ట్మెంట్ నందు అటెండర్ పని చేస్తున్నాడు ఇద్దరు ఆడపిల్లలు సంతానం కలిగినారు గత కొన్ని సంవత్సరాలుగా రాముకి అతని భార్య కు మధ్య కాపురం విషయంలో గొడవలు జరుగుతున్నాయి.చాలాసార్లు గ్రామపెద్దలు వద్ద పంచాయితీలు అయ్యాయికాని భార్యాభర్తల మధ్య గొడవలు అవుతునే ఉన్నాయి దాంతో గత 20 రోజుల క్రితం రాము భార్య జయకుమారీ ఇల్లు వదిలి అమ్మగారింటికి వెళ్లిపోయింది.అప్పటినుండి భార్యాభర్తలు ఇద్దరు ఫోన్లో గొడవలు పడుతూనే వున్నారు. ఈ క్రమంలో భార్య కాపురానికి రాదని మనస్తాపం చెంది ఈ రోజు సాయంత్రం 3.30 నిమిషాల సమయంలో రాము తన పాత డాబా ఇంటి స్లాబ్ ఫ్యాన్ హుక్ కి తాడుతో మెడకు ఉరి వేసుకొని చనిపోయి నాడని రాము పెద్ద కుమార్తె ఉమా మహేశ్వరి పిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ సురేశ్ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: