*మనం ఎవరి కోసం పని చేస్తున్నాం.
*పేద వారిని మీరు పట్టించుకోరా.
*జడ్పి చైర్ పర్సన్ కుసుమ జగదీష్.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం ముప్పు ప్రాంతాల్లో(4,7 వార్డు లలో) ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ పర్యటించారు.లోతట్టు ప్రాంతాలుజలమయమయ్యాయి.ఇండ్ల లోకి నీళ్లు వచ్చిన కనీసం గ్రామపంచాయతీ అధికారులు పట్టిచుకోకుండా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.జలమయం అయిన ఇంటి దగ్గర అధికారులు వచ్చి చూసి సమాధానం చెప్పి సమస్య పరిష్కరం చూపిస్తేనే ఇక్కడ నుండి వెళ్తాను అని బిస్మిస్చుకొని అక్కడే జడ్పీ చైర్మన్ కూర్చున్నారు.
గ్రామపంచాయతీ కార్యదర్శి అక్కడికి చేరుకోగానే
ప్రజల బాధలు అధికారులకు కనపడవా...?
మనం ఎవరి కోసం పని చేస్తున్నాం...?
పేద వారిని మీరు పట్టించుకోరా...?
ఈ నీళ్ల నిలిచి చిన్న,పెద్ద,వృద్ధులకు అనారోగ్యంతో బాధ పడితే అనుకోకుండా ఏమి అయిన అపాయం అయితే ఎవరు బాద్యులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం చేసి నాకు తెలియజేయాలి అని అక్కడ నుండి కదిలారు. ఆయనతోపాటు ములుగు నియోజకవర్గ సీనియర్ నాయకులు గోవింద నాయక్, ఏటూరు నాగారం పిఎసిఎస్ చైర్మన్ కూనురు అశోక్ గౌడ్, ఏటూరు నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, వావిలాల రాంబాబు,అజ్మత్ ఖాన్, కొండాయి చిన్ని తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: