అంబులెన్స్ వాగు దాటాక పోవడంతో ముత్తయ్య మృతదేహాన్ని మోసుకుంటూ పోయిన కుటుంబ సభ్యులు
గుండాల ఆళ్ల పల్లి సెప్టెంబర్ 11 (మన్యం టీవీ) జోలె కట్టి మృతదేహాన్ని జల్లేరు వాగు దాటించిన కుటుంబ సభ్యులు. ఆళ్ల పల్లి మండలం బొడాయి కుంట గ్రామానికి చెందిన గుమ్మడి ముత్తయ్య( 65) గత వారం రోజుల నుండి మలేరియా జ్వరం తో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెం తీసుకెళ్లి చికిత్సను అందించారు చికిత్స పొందుతూ ముత్తయ్య శనివారం మృతిచెందడంతో స్వగ్రామం తీసుకువెళ్లడానికి జల్లేరు వాగు అంబులెన్స్ దాటక పోవడంతో జోలె కట్టి కుటుంబ సభ్యులు వాగులో నడుచుకుంటూ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లారు
Post A Comment: