చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ జెండా ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. గురువారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బోజ్య నాయక్ టిఆర్ఎస్ దిమ్మపై జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మండలంలో 14 గ్రామపంచాయతీలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. పార్టీ ప్రతిష్టకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యం, సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఉత్పల ఏడుకొండలు, మండల నాయకులు మండల గాడ్ శివ ప్రసాద్, అప్పాజీ, గాదె లింగయ్య, సురా వెంకటేశ్వర్లు, వంకాయలపాటి బాబురావు, ఉన్నం నాగరాజు, దార బాబు, భూపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: