మన్యం మనుగడ, పినపాక:
అంగన్వాడీ పాఠశాలకు సంబంధించి పోషణ అభియాన్ కార్యక్రమం లో భాగంగా పోషకాహార వారోత్సవాలు పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం పంచాయతీలో గల పోతిరెడ్డిపల్లి అంగన్వాడి కేంద్రం లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ హాజరై, పోషకాహార వారోత్సవాల గురించి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన, గర్భిణీలకు, చిన్న పిల్లలకు ఎక్కువగా ఉపయోగపడే పోషక ఆహార విలువల గురించి, వాటి వలన కలిగే లాభాలు గురించి వివరించడం జరిగింది. అనంతరం అంగన్వాడి సూపర్వైజర్ చంద్రకళ మాట్లాడుతూ, గర్భిణీలకు పిల్లలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గర్భిణీ వినియోగించుకుని,పోషకాహారం తీసుకుని పుట్టబోయే బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలని తెలియజేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రాసన, బడి ఈడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. శ్రీమంతం కార్యక్రమం విషయంలో గర్భిణీ స్త్రీలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో,
బయ్యారం గ్రామపంచాయతీ లో గల అంగన్వాడి లు అలివేలు, శ్రీలత, రమాదేవి, సావిత్రి, సరోజినీ, మంగ, సుజాత, కుమారి, ప్రమీల, విజయకుమారి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: