5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన వైఎస్సార్ టిపి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో కన్వీనర్ సోయం వీరభద్రం
మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజక వర్గ ప్రతినిధి (సెప్టెంబర్-14)::భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, పార్కలగండి గ్రామ పంచాయతీ కి చెందిన ఊకే శ్రీను కు, గత మే నెలలో ప్రమాదం జరిగినది.ఆ ప్రమాదంలో శ్రీను నడుముకు గట్టిగా గాయాలు కాగా లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. మందుల కోనుగోలుకు కూడా, డబ్బులు లేని దిన పరిస్థితుల్లో వున్న, నిరుపేద కుటుంబీకుడైన శ్రీను గురించి స్థానిక గ్రామస్తుడైన కాకా శివశంకర్ ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వైరల్ చేయగా, వైఎస్సార్ టిపీ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గం నాయకుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో కన్వీనర్ సోయం వీరభద్రం తెలుసుకుని బాధితుడిని పరామర్శించి ,5000 రూపాయిల ఆర్థిక సహాయం అందించారు. అలాగే శ్రీను కుటుంబానికి ఆరోగ్య శ్రీ కార్డు లేకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో మాట్లాడి ఆరోగ్య శ్రీ కార్డు ఏర్పాటు చేసి మంచి వైద్యం జరిగే విధంగా చూస్తానని వారి కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ యువ నాయకులు వాడే వీరస్వామి, ఉపసర్పంచ్ పూనెం నాగమణి,రామకృష్ణ, తనికెళ్ళ ఏసుపాదం,ధర్మయ్య,భాను ప్రసాద్, స్థానిక గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. ఈ నిరుపేద గిరిజనుడికి ఉన్నంతలో ఆర్థిక సహాయం చేయదలచిన మహనీయ దాతలు 8008613303 ఫోన్ పే మరియు గూగుల్ పే ద్వారా సహాయం చేయగలరని సోయం వీరభద్రం మరియు అదివాసీ నాయకులు కోరుతున్నారు.
Post A Comment: