CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వరద నీటిలో కొట్టుకుపోయి చిన్నారి మృతి

Share it:

 



మన్యం టీవీ పాల్వంచ:-


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలానికి చెందిన శనగ అంజలి (7) ఈ రోజు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వరద నీటిలో కొట్టుకపొయి మరణించింది.స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం వికలాంగుల కాలనీ కి చెందిన శనగ రవి,నాగమణి దంపతులకు ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి తేజ(13),రెండవ వ్యక్తి అబ్బాయి మణికంఠ(9),

మూడవ అమ్మాయి అంజలి(7),తల్లిదండ్రులు కూలిపని చేసుకొని జీవనం సాగిస్తున్నారు.ఈ రోజు ఉదయం ఏడుగంటల నుండి కురుస్తున్న భారీ వర్షాల కు మణికంఠ,అంజలి అన్న చెల్లెలు వరద నీటిలో కొట్టుకపోతుంటే మణికంఠ ని స్ధానికుడు శ్రీరాం (15)అనే యువకుడు చేయి అందించి కాపాడాడు.దురద్రుష్టవాసాత్తు అంజలి కొట్టుకపోయి చనిపోయింది.చేపలు పట్టే వల వేస్తే గాని వలలో దొరికింది.శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.పాల్వంచ తహశీల్దార్ స్వామి హాస్పిటల్ లో వున్న శవాన్ని దర్శించి ప్రభుత్వం నుండి ఏమైనా ఆర్ధిక సహాయం వుంటే తప్పకుండా అందాంచే ఏర్పాట్లు చేస్తానని హామి ఇచ్చారు.

Share it:

Post A Comment: