హైదరాబాద్: తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్లో సమావేశమయ్యారు. తెరాస సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 15 నాటికి గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. అదేవిధంగా ఈనెల 20 నాటికి మండల కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. మండల కమిటీల తర్వాత జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు. పార్టీ కమిటీల్లో మహిళా కార్యకర్తలకు ప్రాధాన్య మివ్వాలని కేటీఆర్ సూచించారు.
Post A Comment: