ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని గుండాల ప్రాథమిక వైద్య కేంద్రం డాక్టర్ మున్వర్ అలీ అన్నారు. సోమవారం మండలంలోని ల్యాబ్ లను వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జ్వర లక్షణాలు ఉన్నవారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల టెస్టులు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. అంతేకాకుండా కొత్తగా వచ్చిన టీ- హబ్ ద్వారా రక్త నమూనా ను స్వీకరించి ఎన్నో రకాల వ్యాధులను తెలుసుకోవచ్చని అన్నారు. ప్రైవేట్ ల్యాబ్ లు, ఆర్ఎంపీలు ఇష్టానుసారంగా పరిమితికి మించి వైద్యం చేస్తూ టెస్టుల పేరుతో అధిక ధరలు తీసుకున్నట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ శ్రీహరి, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్, ఫార్మాసిస్ట్ సోమ్లా పాల్గొన్నారు
Post A Comment: