మన్యంటీవి, దమ్మపేట: కరోనాతో దమ్మపేట మండలం రాచూరు పల్లి గ్రామానికి చెందిన సవలం రమణ(48) మృతి చెందింది. దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు అశ్వారావుపేట పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్ర రావు కు సమాచారం అందించారు. స్పందించిన రామచంద్ర రావు సేవా సమితి సభ్యులు నార్లపాటీ అశోక్, మేడూరి ప్రసాద్ పంతులు, సత్తిబాబు లను వెంట తీసుకొని రాచూరుపల్లి గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులు తోడురాగా దహన సంస్కారాలను పూర్తిచేశారు.
Post A Comment: