మన్యం మనుగడ, కరకగూడెం:
తెలంగాణ ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, జడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య లు కరకగూడెం మండలంలోని కుర్నవల్లి గ్రామంలో గల రేగా కాంతారావు స్వగృహానికి వెళ్లి, ఇటీవల ఆయన మేనల్లుడి భార్య మరణించిన విషయం గురించి వివరాలు తెలుసుకొని వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజులకే రేగా కుటుంబంలో విషాదం జరగడం చాలా బాధాకరమని, ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం సిడిపిఓ జయలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు, మంత్రిని కలుసుకొని పుష్పగుచ్చం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, రేగా కుటుంబ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది....
Post A Comment: