మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం ఏమార్వో సురేష్ బాబు గారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి రేషన్ డీలర్ల సమావేశంనందు పాల్గొన్న ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ సందర్భంగా ఫింగర్ ప్రింట్,ఐరీస్ పడక ఇబ్బందులను పడుతున్న రేషన్ వినియోగదారుల కార్డ్స్ పరిశీలించి జిల్లా కల్లెక్టర్ మరియు సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఏమార్వో సురేష్ బాబు గారికి విజ్ఞప్తి చేసారు,దీనిపై ఏమార్వో స్పందించి మండల స్థాయి రేషన్ డీలర్ల సహకారంతో ఈ సమస్యతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న వినియోగదారులను పిలిపించి వారి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెల్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,రేషన్ డీలర్ల నాయకులు కొడాలి వెంకటేశ్వర్లు,మండల స్థాయి రేషన్ డీలర్లు, ఆర్ ఐ తిరుపతి రావు,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: