మన్యం టీవీ, కొత్తగూడెం సెప్టెంబర్ 30 :- గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మండల, మున్సిపల్ పరిధిలోనీ 3 వార్డు నందు కరోనా వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి బ్యాండ్ మేళాలతో వెళ్లి ప్రచారం చేసిన మూడవ వార్డు కౌన్సిలర్ పరమేష్ యాదవ్. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రజలు సురక్షితంగా ఉంటారని అపోహలు నమ్మవద్దు అని ప్రతి ఒక్కరు కూడా కరోనా టీకా తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ పూర్తి స్థాయిలో తగ్గ నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్కులు శానిటైజర్ వాడుతు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు ఆయన తెలియజేశారు. అదేవిధంగా మరొకవైపు సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.
Post A Comment: