జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి
మృతుని కుటుంబానికి పరామర్శ
మన్యం టీవీ మంగపేట.
ఆపద సమయంలో ఉన్న బొడ్డు ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉంటానని మానవసేవే మాధవసేవ అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. శుక్రవారం అకినేపల్లి మల్లారం ఎస్ టి కాలనీ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొడ్డు ప్రభాకర్ కుమారుడు బొడ్డు జగదీష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించి అధైర్య పడవద్దని అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన బొడ్డు ప్రభాకర్ దంపతులకు ఆర్థిక సహాయం మరియు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ మనో ధైర్యమే మనో వ్యద నివారణకు మంచి మందు అన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ ఆగ్రి ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్ కాంగ్రెస్ గిరిజన నాయకులు లక్కీ వెంకన్న విఏ యఫ్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి చెట్టుపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: